ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి లో తన క్యాంపు కార్యాలయంలో రెండోవిడత వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేయడం జరిగింది.వర్చువల్ వీడియో విధానం ద్వారా జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో కి నేరుగా డబ్బులు జమ చేసారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు లబ్ధి చేకూరాన్నునాయి.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న.
నిరుపేదల కాపుల కోసం.ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి కాపు మహిళకు 75వేల సాయాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదే తరుణంలో అనర్హులను పక్కన పెట్టేస్తమని పేర్కొన్నారు.కాపుల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని .కాపుల పట్ల వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపులు గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో గుర్తు తెచ్చుకోవాలని, తెలుగుదేశం పార్టీ హయాంలో 1500 కోట్ల రూపాయలు ఏడాది కి కాపులకు కేటాయించడం జరిగిందని, కనీసం ఏడాదికి నాలుగు వందల కోట్లు కూడా ఇవ్వలేదు అని జగన్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే రెండో విడత “వైయస్సార్ కాపు నేస్తం” ద్వారా మూడు లక్షలకు పైగా ఉన్న కాపులకు దాదాపు 500 కోట్ల ఆర్థికసహాయం తాజాగా వైసీపీ ప్రభుత్వం అందించింది.