బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం.దాన్ని చూసినా దాని పేరు ఎత్తినాచాలా చాలా మందికి నోరూరుతుంది.
అలాంటిది బిర్యానీని కేవలం 5 పైసలకే అమ్మితే జనాలు ఎగబడి మరీ తింటారు.తమిళనాడులోని మధురై జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
తమిళనాడులోని ఓ హోటల్ లో యజమానికి ఇటువంటి అనుభవమే ఎదురైంది.ఓ హోటల్ ప్రారంభించేటప్పుడు బంపరాఫర్ ప్రకటించారు.
అక్కడ కేవలం 5పైసలకే ప్లేటు బిర్యానీ అని ప్రకటించారు.దీంతో జనాలు ఎగబడిమరీ తిన్నారు.
అయితే ఈ బంపరాఫర్ కు యజమాని కొన్ని షరతులను కూడా విధించారు.అయినా సరే ప్రజలు మాత్రం క్యూ కట్టారు.
దీంతో ఆ హోటల్ జనాలతో కిటకిటలాడిపోయింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్లో ఓ హోటల్ ఫేమస్ అయిపోయింది.తాజాగా సుకన్య బిర్యానీ హోటల్ ను మొదలుపెట్టారు.
దీంతో హోటల్ ప్రారంభం సందర్భంగా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది.అయితే ఎప్పుడో కనుమరుగైపోయిన ఆ ఐదు పైసల నాణేలు ఇప్పుడు ఎవరి దగ్గరా ఉండవు కదా.
అలా అనుకుని ఆఫర్ ప్రకటించిన హోటల్ యాజమాన్యానికి ఊహించని విధంగా ట్విస్ట్ జరిగింది.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున జనాలు అక్కడికి ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చారు.ప్రజలు ఐదు పైసల నాణేలతో హోటల్ ముందు క్యూ కట్టారు.సుమారు 300 మంది వరకు 5పైసల నాణేన్ని తీసుకొని వచ్చి ఫ్రీగా కడుపునిండా బిర్యానీని తిని వెల్లారు.
అయితే బిర్యానీ ధ్యాసలో పడిపోయిన జనాలు కరోనా సోకే విషయాన్ని మాత్రం మరిచిపోయారు.
ఊహించని విధంలో వందల సంఖ్యలో జనాలు రావడంతో హోటల్ యాజమాన్యం తమ హోటల్ యొక్క షట్టర్లను మూసేయాల్సిన వచ్చింది.ఇంకొందరైతే ఆలస్యంగా వచ్చి 5పైసల నాణెం ఇచ్చినా సరే బిర్యానీ వారికి ఇవ్వలేదు.గతంలో కూడా దిండిగల్ పట్టణంలో ఇటువంటి ఆఫర్ నే ప్రకటించారు.
దానికి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది.