తెలంగాణ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది వైఎస్.షర్మిల.
మొదటి నుంచి ఆమె తన తండ్రి పేరు చెప్పుకుంటూనే వస్తోంది.అంతే కాదు తన పార్టీ కార్యకర్తలుగా తన అన్న పార్టీ వైసీపీలోఉన్న నాయకులనే తన పార్టీకి నాయకులుగా ఉపయోగించుకుంటోంది.
ఇక ఎన్ని చేసినా కూడా ఆమెకు రోజురోజుకూ కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.ఇక ఆమెపార్టీలో కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక్క నేత కూడా లేడు.
ఆమె తప్ప ఆ పార్టీలో ముఖ పరిచయం అక్కర్లేని నాయకుడు ఒక్కరూ లేరు.
కనీసం ఎక్కడికైనా వెళ్లి నిరసన చేద్దామన్నా కూడా పెద్దగా జనాలు రావట్లేదు.
కనీసం ఆమె పార్టీ ఉందని కూడా జనాలకు ఎవరికీ తెలియదు.మరి ఇంత జరుగుతున్నప్పుడు నలుగురిని తన పార్టీలోకి వచ్చేలా చూడాలి అంటే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
వారికి అనుకూలంగా తనపార్టీ ఉందనే భావన కల్పించాలి.కానీ అలా కాకుండా షర్మిలే కొన్ని కండీషన్లు పెడుతుందంట.
ఇప్పుడున్న యువతను ఆకట్టుకోవాలంటే చాలా రకాలుగా వారికి అనుకూలమైన విధానాలను అనుసరించాలి.కానీ షర్మిల మాత్రం ఎవరు తనపార్టీలోకి వచ్చినా కూడా షర్మిలను షర్మిలమ్మ అనే పిలవాలంటూ తన పార్టీ నేతల నుంచి ఆదేశాలు ఇప్పిస్తోందంట.
అసలు ఎవరు షర్మిలతో మాట్లాడాలనుకున్నా కూడా ఆమెను షర్మిలమ్మ అనాలని చెప్పడమే పెద్దగా ఎవరికీ నచ్చట్లేదంట.ఎందుకంటే అమ్మా అనే పదం ఆంధ్రాలోపనిచేస్తుంది గానీ తెలంగాణలో మాత్రం అవేవీ పెద్దగా ఆకట్టుకోవు.అక్కా లాంటి పదమే ఆకట్టుకుంటుంది.ఇలా షర్మిల పెట్టే పరిణామమే ఆమెకు యూత్ ను చేరువ చేయలేక పోతోందని చెబుతున్నారు రాజకీయ విశ్లషకులు.అందుకే ఆమె విద్యార్థుల తరఫున ఉద్యమం చేసినా కూడా పెద్దగా వర్కువట్ కావట్లేదనే ప్రచారం నడుస్తోంది.ఇక ఇప్పుడు రూటు మార్చిన షర్మిల కనీసం పెద్దలకు దగ్గర కావాలనే క్రమంలో పోడు భూముల కోసం పాదయాత్ర చేస్తున్నా అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ రావట్లేదంట.