మా”లో ఇప్పటికీ.గొడవలు ఉన్నాయి.
గతములో జైలుకెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు.!? శృతిమించితే వారి పేర్లు బయట పెడతా.సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.తెలుగు పరిశ్రమ టాలీవుడ్ లో ‘ మా ‘ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతుంది.అధ్యక్ష పదవి కోసం ‘ ప్రకాష్ రాజ్ ‘, ‘ మంచు విష్ణు ‘ మధ్య గట్టి పోటీ నెలకొంది.తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.‘మా’లో యూనిటీ లేదన్నారు.గతంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని అన్నాడు .ఆయన ఉద్దేశ్యపూర్వకంగా అన్నారా.!? ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు.ఇలా ఎందుకు అన్నాడు.!? కరోనా టైం లో ఎన్నో కుటుంబాలు ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీలో ” అందరివాడు కాకుండా కొందరివాడులా ” చూస్తున్నారా.!?
నాగ బాబు ప్రకాష్ రాజు కి సపోర్ట్ చెయ్యడం.చిరంజీవి ఇరకాటంలో పడ్డాడ…!? మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఇండస్ట్రీ పెద్దమనిషిలా మంచు విష్ణు చూడటం లేదు.!? ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దాసరి, నాన్నగారు మోహన్ బాబు తప్ప అంటూ చెప్పుకొస్తున్నాడు తప్ప మెగాస్టార్ అని ఏ ప్రెస్ మీట్ లో చిరంజీవి కూడా ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దే అని సంబోధించడం లేదు ఎందుకు.! సినీ పెద్దలు అందరూ కలిసి ఏకంగా “మా”కు ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే నేను కూడా కచ్చితంగా ఉంటానని అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు.
మా భవనం అనేది తన ప్రధాన ఎజెండా కాదని ఆర్టిస్టులకు సంబంధించిన సమస్యలు ప్రొడక్షన్ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆర్టిస్టు సంఘం అధ్యక్షులు తెలుగు వాళ్లు కావాలని తన అనలేదని కానీ మెంబర్లు కాని వారు మాత్రం పోటీ చేయొద్దని వెల్లడించారు.
అంతేకాకుండా మా లో సభ్యత్వం లేని వాళ్లు సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని అన్నారు.మాకోసం ఇంకా ఎవరూ పోటీ చేయక ముందే నన్ను పోటీ చేయమని కొందరు పెద్దలు సూచించారని అని చెప్పాడు.అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా మా భవనాన్ని నిర్మిస్తానని దానికి బాలయ్య కూడా సాయం చేస్తాను అన్నాడని అని చెప్పుకొచ్చారు.
కొందరు కష్టకాలంలో సాయం చేసి టామ్ టామ్ చేసుకుంటున్నారని కానీ ఇండస్ట్రీలో ఎంతమంది అలా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారని.మంచి చేసినప్పుడు ప్రసారం చేస్తే అది కొంతమందికి పూర్తవుతుందని కానీ వాళ్లకి వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించడం.
అలాగే గతంలో జైలుకెళ్లొచ్చినా కొంతమందిని ఎవరు కాపాడలేడు వాళ్ళని అడిగితే తెలుస్తుంది అని శృతిమించితే పేర్లు బయట పెట్టాలి వస్తుందని మంచు విష్ణు గట్టిగానే హెచ్చరించారు ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది దీంతో ఇప్పుడు అంతా ఆ జైలుకుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరు అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.