ప్రగతి భవన్ లో ఇటీవల సింగరేణి ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో కెసిఆర్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
సింగరేణి ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు బోర్డు మీటింగ్ లో పదవి విరమణ వయసు పెంపు అమలు తేదీని నిర్ణయించాలని ఆదేశించారు.
ఈనెల 26వ తారీఖున సింగరేణి బోర్డు మీటింగ్ జరగబోతుంది.
అదే సమావేశంలో అమలు తేదీని నిర్ణయించాలని సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ నిర్ణయం ద్వారా 43 వేల మందికి పైగా సింగరేణి కార్మికులకు.అధికారులకు లబ్ధి చేకూరనుంది.అప్పట్లో ఉద్యోగ సంఘాలు అదే రీతిలో సింగరేణి కార్మిక సంఘాలు వయోపరిమితి ఈ విషయంలో అనేక ధర్నాలు నిరసనలు చేపట్టడంతో తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటంతో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.