నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి కెరియర్ గ్రాఫ్ తగ్గడంతో సినిమాలకు దూరమైంది.అడపాదడపా ఏవో చిన్నా చితగా పాత్రలు చేస్తూ వస్తుంది.
పెళ్లి తర్వాత అది కూడా చేయని ప్రియమణి ఢీ షో ద్వారా మళ్లీఎ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఆ షోకి మూడు సీజన్ల నుండి జడ్జ్ గా ఉంటున్న ప్రియమణి ఆ షో వల్ల మళ్లీ ఆడియెన్స్ లో క్రేజ్తె చ్చుకుంది.
అలానే సినిమా ఛాన్సులు వస్తున్నాయి.విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో సుందరమ్మ పాత్రలో ప్రియమణి మరోసారి ప్రేక్షకుల మనసు గెలిచింది .సినిమాలో ప్రియమణి సహజ నటన ఆకట్టుకుంది.
ఒరిజినల్ వర్షన్ లో చేసిన మంజు వారియర్ కు ఏమాత్రం తీసిలోని విధంగా ప్రియమణి నటన ఉంది.
సినిమాలో ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది ప్రియమణి.ఇక సినిమాలో నారప్ప అదే మన విక్టరీ వెంకటేష్ మరోసారి తన సత్తా చాటాడు.ఈ సినిమాలో వెంకటేష్ నటన హైలెట్ అని చెప్పొచ్చు.నారప్ప సినిమాతో ప్రియమణి తిరిగి ఫాం లోకి వచ్చిందని చెప్పొచ్చు.
ఈ సినిమాతో పాటుగా రానా విరాట పర్వం సినిమాలో కూడా ప్రియమణి నటించింది.ఆ సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది.