కరోనా సెకండ్ వేవ్ వల్ల మొన్నటి వరకు థియేటర్లు మూతపడ్డాయి.జూలై 23 నుండి తెలంగాణాలో థియేటలు తెరచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.ఈ క్రమంలో థియేటర్ల నష్టాలను పూడ్చేందుకు జీవో నెం.63ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2018 నుండి థియేటర్లో పార్కింగ్ ఫీజు వసూలు రద్దు చేస్తూ జీవో నెం 63 ని సవరించింది తెలంగాణ ప్రభుత్వం.అప్పటి నుండి థియేటర్లో పార్కింగ్ ఫీజులను వసూలు చేయట్లేదు.
అయితే కరోనా వల్ల నష్టాల్లో ఉన్న థియేటర్లను ఆదుకునేందుకు జీవో ని రద్దు చేశారు.జూలై 23 నుండి తెరచుకునే థియేటర్లలో పార్కింగ్ ఫీజుని కూడా వసూలు చేస్తారని తెలుస్తుంది.
మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ లకు మాత్రం ఎప్పటిలానే పార్కింగ్ ఫీజుని వసూలు చేయకూడదని చెబుతునారు.వీటి కోసం మాత్రం గతంలో జారీ చేసిన ఉత్తర్వులే కొనసాగుతాయని చెబుతున్నారు.
థియేటర్ల వద్ద ఎక్కువ సంఖ్యలో వాహనాలు నిలపడంతో పర్యవేక్షణ లేక శాంతిభద్రతలకు భంగం కలుగుతుంది.అందుకే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవరిస్తూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా ఆర్డర్స్ పాస్ చేసింది.
ఇక మీదట థియేటర్లలో పార్కింగ్ ఫీజ్ వసూలు చేయడం కామన్ అని తెలుస్తుంది.అయితే ఇవి కొనసాగిస్తారా లేక కొన్నాళ్లు మాత్రమే ఉంచుతారా అన్నది మాత్రం తెలియదు.