సందర్భం ఉన్నా, లేకపోయినా, టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు పై ఈటెల రాజేందర్ ఏదో ఒక అంశంపై సానుభూతితో కూడిన విమర్శలు చేస్తూనే వస్తున్నారు.వాస్తవంగా రాజేందర్ హరీష్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఉద్యమ కాలం నుంచి ఇద్దరు నేతలు కెసిఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరి టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది.
రాజేందర్ కు ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చిన కేసీఆర్ చివరకు ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి బయటకు పంపించారు.
ఆ పరిణామాల క్రమంలో రాజేందర్ బీజేపీలో చేరడం, హుజురాబాద్ లో ఎన్నికలు రావడం అనివార్యం అయ్యాయి.
ఇక అప్పటి నుంచి హరీష్ సానుభూతితో కూడిన విమర్శలు చేస్తూ వస్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం పై పూర్తిగా హరీష్ దృష్టి పెట్టడం, తన అనుచరులను టీఆర్ఎస్ వైపు తీసుకెళుతుండడం వంటి పరిణామాలతో హరీష్ పైన రాజేందర్ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న రాజేందర్ ఈ సందర్భంగా మరోసారి హరీష్ వ్యవహారంతో పాటు, కెసిఆర్ హామీల పైన స్పందించారు.
తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఎటు పోయినారు ? కేసిఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం.దళిత సీఎం ఎటు పోయింది ? ఉప ముఖ్యమంత్రిని ఎందుకు పీకినావ్ ? మూడు ఎకరాల భూమి ఎటు పోయింది ? పెన్షన్లు ఎటు పోయినాయి ? అంటూ విమర్శలు చేశారు.పది కోట్లు ఇచ్చినా, మా ప్రజలు ఆత్మ ను అమ్ముకోరు.
మా డబ్బు తో సోకులు చేసేది మీరు .రంగనాయక సాగర్ కి పోయి మనుషులను కొంటున్నావ్.హరీష్ రావు నిన్ను కూడా కేసీఆర్ వదిలిపెట్టడు.నీకు నా గతి పడుతుంది అంటూ ఈటెల రాజేందర్ హెచ్చరించారు.