ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ పరిణామంతో మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

 Night Curfew Entended In Andhra Pradesh Corona Vaccine, Andhra Pradesh, Ys Jagan-TeluguStop.com

ఇటీవల కరోనా సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదే రీతిలో రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జన సమూహాలు ఎక్కడ కూడా గుమి గుడకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని.ఆంక్షలు విధించాలని సూచించారు.

ఇదే తరుణంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా రాష్ట్రంలో జరుగుతుందని దానికి అందరి సమిష్టి కృషి తోడ్పడటం హర్షించదగ్గ విషయమని, ఒకవేళ రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చినా కానీ ఎదుర్కొనే రీతిలో అందరూ ఉండాలని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగం కొద్దిగా ఊపిరి పీల్చుకుంది.

అయినా కానీ ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎదుర్కొనే రీతిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్  తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube