వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పార్టీని ప్రకటించిన తరువాత ఇక యాక్టివ్ గా ముందుకెల్తోంది.అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణలో అందరి ప్రతిపక్షాల రూట్ లోనే షర్మిల ముందుకెళ్ళనుందనే సంకేతాలిస్తోంది.
ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలపై అవగాహన పెంచుకుంటూ అధికార పక్షం టార్గెట్ గా ముందుకెళ్తోంది.అయితే తాజాగా నిరుద్యోగుల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.తెలంగాణలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పేరుగుతుందే గాని తగ్గడం లేదని షర్మిల మొదటి నుండి ఘాటుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ దీక్షలు చేపట్టడం వెనుక ఉన్న ప్రధాన వ్యూహం ఏంటని ఒక్కసారి గమనిస్తే దీక్షల ద్వారా చేపట్టిన రోజు మొత్తం ప్రభుత్వంపై రకరకాల రీతిలో విమర్శించడానికి అవకాశం ఉంటుంది.
తద్వారా ప్రభుత్వం స్పందించే అవకాశం చాలా ఎక్కువ.అంతేకాక వరుస దీక్షల ద్వారా ఎక్కువ సమయం వార్తలలో ఉండే అవకాశం ఉంది.తద్వారా పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కావున షర్మిల దీక్షల వ్యూహాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే నేడు చేపట్టిన నిరుద్యోగుల దీక్షపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.