1.నేటి నుంచి జేఈఈ మెయిన్స్
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 27 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
2.తెలంగాణలో 60 వేల పోస్టులు ఖాళీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించడానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కసరత్తు చేస్తున్నారు.ఇప్పుడు వరకు విశాఖలో దాదాపు 60వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు దీనిపై నివేదికను కేసీఆర్ కు అందించి ఇతరులను పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
3.మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు కేబినెట్ హోదా
తెలంగాణ మహిళా కమిషన్ వి సునీతా లక్ష్మారెడ్డి కి ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది.
4.25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ల్లో ఇంటర్, డిగ్రీ లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష నిర్వహించనున్నారు.
5.ఏయూ కు గ్రీన్ ఛాంపియన్ అవార్డ్
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది.కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ లోని మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ ఈ అవార్డును ఏయూ కి ప్రకటించింది.
6.హెచ్ సి యు ప్రవేశ పరీక్ష తేదీ మార్పు
రెండువేల 21 22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మార్పు చేసింది.సెప్టెంబర్ 3న ఆ పరీక్షను నిర్వహిస్తారు.
7.మావోయిస్టులు లేఖ
మహబూబాబాద్ డివిజన్ కమిటీ ఆజాద్ పేరుతో మావోయిస్టు లేఖ రాశారు.ఆదివాసీల కోడు భూములను ప్రభుత్వం కబ్జా చేయాలని చూస్తోందన్నారు.అటవీశాఖ పోలీసులు ఆదివాసి గూడాల పై దాడులు చేస్తున్నారని , దోపిడీదారులకు ఏజెంట్లుగా వనరులను దోచుకుంటున్నారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.
8.టీఆర్ఎస్ లో చేరనున్న కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి నేడు కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
9.పాలిటెక్నిక్ ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ ఫలితాలను సాంకేతిక విద్యా మండలి అధికారులు సోమవారం వెల్లడించారు.మొత్తం 11 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా క్రెడిట్ల ప్రకారం ఫలితాలు విడుదల చేశారు.
10.చిన్న తిరుపతి లో తొలి ఏకాదశి వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమల వెంకన్న ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి.
11.ఏపీకి ప్రత్యేక హోదా పై రాజ్యసభలో నోటీసు
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో రెండోరోజు మంగళవారం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.
12.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.కొవిడ్ నివారణపై జగన్ సమీక్ష
ఏపీలో కోవేట్ నివారణ చర్యలు పై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
14.విశాఖలో ఎల్జి ఎలక్ట్రానిక్స్
విశాఖలో ఎల్జి పాలిమర్స్ పరిశ్రమ స్థానంలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది.
15.ఈటెల రాజేందర్ తో వ్యక్తిగత కక్ష లేదు
మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ తో తనకు వ్యక్తిగత కక్ష లేదని, ఆయనకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
16.భారత్ కు 75 లక్షల మోడర్నా టీకాలు
భారత్ లో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్కు 75లక్షల మోడర్న్ రానున్నట్లు , వీటిని కొవాక్స్ కార్యక్రమం ద్వారా అందజేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
17.లండన్ లో మరో కొత్త వైరస్
ఇంగ్లాండ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించగా, మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.తాజాగా యూకే లో నోరు వైరస్ వెలుగులోకి రావడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ కేసులో బారినపడే వారి సంఖ్య పెరుగుతున్నట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తెలిపింది.
18.ఉచితంగా ఐటి కోర్సులపై శిక్షణ
డిజిటల్ రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దేందుకు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ , నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లు సంయుక్తంగా పని చేసేందుకు సిద్ధం అయ్యాయి.డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది.ఈ స్కిల్ ఇండియా వేదిక ద్వారా సిస్కో నెట్వర్కింగ్ కోర్సులు ఉచితంగా లభిస్తాయి.
19.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,030 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,030.