ఇటీవల విజయనగరానికి చెందిన కీలక నాయకురాలు మాజీ ఎమ్మెల్యే టిడిపి పార్టీ మహిళా అధ్యక్షురాలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పరిణామం జరిగి వారం రోజులు అవ్వకముందే చంద్రబాబు కి మరో బిగ్ షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్ మంగళవారం (నేడు) ఏపి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.
జియాఉద్దీన్ ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ కీలక నేతలతో కలసి ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు.
మైనార్టీ విభాగంలో మంచి పట్టున్న లీడర్ గా జియాఉద్దీన్.తెలుగుదేశం పార్టీలో అప్పట్లో కీలకంగా రాణించారు.అటువంటి వ్యక్తి తాజాగా వైసీపీలోకి వెళ్తూ ఉండటంతో గుంటూరు రాజకీయాలలో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది.చాలా వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా పోరాటం చేయడంలో వెనకబడి పోతుండటంతో పాటు.
మరోవైపు వైసీపీ అధిక సంక్షేమ పథకాలతో ప్రజలు ఆకర్షిస్తూ ఉండటం తో.టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇలాంటి తరుణంలో మొన్న విజయనగరం జిల్లాకు చెందిన శోభా హైమవతి, నేడు గుంటూరు జిల్లాకు చెందిన జియాఉద్దీన్ ఇలాంటి కీలక నాయకులు.పార్టీకి రాజీనామా చేయటం.టీడీపీలో సంచలన కరంగా మారింది.