వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే.నిన్న ప్రధాని మోడీ సభలో ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు నినాదాలతో అడ్డుకుంటూనే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన అనేక విషయాల మీద విపక్షాలు ఏక మవుతున్నాయి.ఇదిలా ఉంటే రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ నేతృత్వంలో ఆల్ పార్టీ భేటీ సమావేశం కానుంది.
కరోనా పరిస్థితి గురించి ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
ఇదే తరుణంలో అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది.కరోనా నియంత్రణ వ్యాక్సినేషన్ పై ఆల్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి.ఇక ఇదే తరుణంలో ప్రతిపక్షాలు పార్లమెంటులో అనుసరించాల్సిన విధానంపై సమావేశమవుతున్నారు.
ఏది ఏమైనా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నారు విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ.మొదటిరోజు నినాదాలతో హోరెత్తిన విపక్షాలు అదే దూకుడు.ప్రదర్శించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.