తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున పవన్ కళ్యాణ్ తదితర సార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగిన ప్రముఖ హీరోయిన్ “శ్రియ శరన్” గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం శ్రియ శరన్ కి 35 సంవత్సరాలు పైబడినప్పటికీ తన వన్నె తరగని అందంతో ప్రేక్షకులని కట్టి పడేస్తుంది.
దీంతో ఈ అమ్మడు ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
అయితే నటి శ్రియ శరణ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోల కారణంగా సోషల్ మీడియాలో మరోమారు హాట్ టాపిక్ గా మారింది.
అయితే నటి శ్రియ శరణ్ తన భర్త ఆండ్రీతో కలిసి పడవలో ప్రయాణిస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోలను షేర్ చేసింది.అయితే ఇందులో శ్రియ శరణ్ ఎదపై తన భర్త ముద్దు పెడుతున్న సమయంలో తీసిన వీడియోను కూడా జోడించింది.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అంతేకాక కొందరు నెటిజనులు ఈ వీడియోపై స్పందిస్తూ సినీ సెలబ్రిటీలు వ్యక్తిగతంగా ఉంచుకోవలసిన విషయాలను పబ్లిక్ లో షేర్ చేయడం మంచిది కాదని అంటున్నారు.అంతేకాకుండా శ్రియా శరణ్ ఈ మధ్య గ్లామర్ డోస్ విషయంలో శృతి మించుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియ శరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు “ఎస్ఎస్ రాజమౌళి” తెరకెక్కిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే మరో బాలీవుడ్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే పెళ్లయిన తర్వాత శ్రియ శరన్ సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించింది.దీనికితోడు ఈ అమ్మడు తన భర్తతో కలిసి “రష్యా దేశం” లో సెటిల్ కావడంతో పారితోషకం పరంగా మరియు తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో మాత్రమే నటిస్తోంది.