1.భారత్ ఆస్తులపై దాడులు చేయాలంటూ ఐ ఎస్ ఐ ఆదేశం
ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ కు సంబందించిన ఆస్తుల పై దాడులు చేయాలంటూ తాలిబాన్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది.
2.ఆఫ్ఘాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్ .భారత్ పై ఆరోపణలు
ఇస్లామాబాద్ లో అఫ్ఘాన్ రాయబారి కిడ్నాప్ కావడం వెనుక భారత్ హస్తం ఉండవచ్చు అని పాకిస్థాన్ హోం మంత్రి రషీద్ అహ్మద్ ఆరోపణలు చేశారు.
3.భారత్ బ్రాండ్ పై కెనడా కన్ను
కెనడియన్ శాటిలైట్ మేజర్ ‘ టెలిస్లాట్ ‘ ఇండియన్ బ్రాడ్ బ్రాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే శాటిలైట్ ప్లేయర్స్ విధానంపై స్పష్టత ఇచ్చేందుకు టెలికాం సంస్థతో చర్చలు జరిపింది.
4.చైనా లో మంకీ వైరస్
కోవిడ్ కు మూల నిలయం అయిన చైనా ను ఇప్పుడు మరో కొత్త వైరస్ భయపెడుతోంది.కోతుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
5.యూకే ను వణికిస్తున్న నోరో వైరస్
యూకే ను మరో వైరస్ వణికిస్తోంది.నోరో వైరస్ గా గుర్తింపు పొందిన ఈ వైరస్ ను వామిటింగ్ బగ్ అని పిలుస్తారు.ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఈ నోరా వైరస్ కేసులు కనిపించినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ప్రకటించింది.
6.అమెరికాలో ఉన్నతాధికారులకు వింత వ్యాధి
అమెరికా కు మరో ముప్పు వచ్చి పడింది.యూరప్ లో ఉన్న అమెరికా ఉన్నతాధికారులకు మాత్రమే ఓ వింత వ్యాధి సోకుతుండడం పై ఆందోళన వ్యక్తం అవుతోంది.అందరూ మెదడుకు సంబంధంచిన వ్యాధితో బాధపడుతున్నారు.దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని అమెరికా నిర్ణయించింది.‘ మైక్రో వేవ్ రేడియేషన్ కారణంగా ఉన్నతాధికారులు ఈ వ్యాధి బారిన పడినట్టు అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
7.అమెరికాలో మాస్క్ తప్పనిసరి చేయాలి
అమెరికాలో మాస్క్ తప్పనిసరి చేయాలని లేదంటే పెను ప్రమాదమే సంభవించ వచ్చు అని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాచి హెచ్చరించారు.
.