పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న ఆయన 27వ చిత్రం హరిహర వీరమల్లు.మలయాళంలో సూపర్ హిట్ అయిన “అయ్యాప్పనుమ్ కోషియమ్” పవర్ స్టార్ పవన్ ళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న భారీ చిత్రానికి ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారు నిర్మాతలు.
ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరిగింది.ఈ సినిమా చిత్రీకరణ చేసిన కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల కొన్ని కారణాల వల్ల పక్కకి తప్పుకున్నారు.
ఆయన స్థానంలో రవి కే చంద్రన్ ని తీసుకొచ్చారు.అయితే సినిమాల్లో ఇప్పటి వరకూ ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను చూసిన పవన్ కూడా టెంపో మారిపోయినట్లు గా ఉందని చెప్పడంతో మరోసారి అన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని చిత్రబృందం అనుకుంటుంది. హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ టీజర్ ను ఎప్పటికీ విడుదల చేశారు.పవన్ కళ్యాణ్ స్థాయిలో ఆ లుక్ ఉండడం అభిమానులు ఎంతో ఆనందంగా పండగ చేసుకున్నారు.
వీరమల్లు గా పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.కాటమరాయుడు లో పంచ కట్టు లో చూశారు.
కానీ ఈ సినిమాలో హిస్టారికల్ హీరోగా, బందిపోటుగా చూడబోతున్నారు.పూర్తిగా మార్చేశారు డైరెక్టర్ క్రిష్.
డైరెక్టర్ క్రిష్ అద్భుతమైన విజన్ కి తగ్గట్టుగా ఎం ఎం కీరవాణి మ్యూజిక్, గ్రాండియర్ విజువల్స్ తో సినిమా నిర్మిస్తున్నారు.ఓ గొప్ప బందిపోటు విరోచిత గాథ అని డైరెక్టర్ క్రిష్ చెప్పారు.
ఇది భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా చెప్పని కథ ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది.