సీనియర్ నటుడు సుమన్ అరుదైన గౌరవం అందుకున్నారు. భారత దేశంలో సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సుమన్ కు అందించారు.
ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో దక్షిణాది నుండి సుమన్ కు ఈ పురస్కారం అందించారు. ఈ అవార్డ్ ను దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ సుమన్ కు అందిచారు.
ఇక తనకు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడంపై సుమన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలని తెలిపారు సుమన్.
కర్ణాటకకు చెందిన సుమన్ తెలుగు తెర మీద హీరోగా రాణించారు.ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పించారు.ప్రస్తుతం విలన్ గా చేస్తూ వస్తున్నారు.ఏ పాత్ర ఇచ్చినా సరే తనదైన శైళిలో మెప్పించే సుమన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.
ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.సుమన్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడం పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ బెస్ట్ విషెష్ అందించారు.