సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే.ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా మారుతూ ఉండే శ్రీ రెడ్డి గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది.
అంతే కాకుండా వాటి పై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంది.కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది.
ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.ఇక ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి.
ఇదిలా ఉంటే శ్రీ రెడ్డి తీవ్ర విషాదంలో ఉందని తెలుస్తుంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె గత కొన్ని రోజుల నుండి ఫేస్ బుక్ కు దూరంగా ఉంది.తాజాగా సినీ నటుడు కత్తి మహేష్ మరణించాక తీవ్ర విషాదం లో మునిగిపోయిందని తెలుస్తుంది.ఈమె కత్తి మహేష్ తో మంచి స్నేహితురాలుగా ఉండేదట.
ఇప్పటికే తన ఇద్దరు స్నేహితులు సూసైడ్ చేసుకుని మరణించారని తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేయగా.ప్రస్తుతం తాను డిప్రెషన్ లో ఉన్నానని, త్వరలో డిప్రెషన్ నుంచి బయటపడతాను అంటూ.డిప్రెషన్ నుంచి బయటపడటానికి బాగా ప్రయత్నిస్తున్నానని తెలిపింది.
ఇక ఇప్పటికే దానికి తోడు కత్తి మహేష్ కూడా మరణించగ అతని మరణం కూడా తట్టుకోలేకపోయిందని అందుకే డిప్రెషన్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.