రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల విషయంలో నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రతి పక్షాలు పొలిటికల్ మైలేజ్ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనుల పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ఇప్పుడు లెటర్ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40 నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడాన్ని నిరసిస్తూ విభేదిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు, వీరాంజనేయ స్వామి అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రకాశం జిల్లా ఎంతో నష్టపోతుందని ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని.లేకపోతే ప్రకాశం జిల్లాకు నీరు అందే ప్రసక్తి ఉండదని ఈ ప్రాంత వాసులకు.
అన్యాయం చేసిన వారు అవుతారు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి తాజాగా లెటర్ రాశారు.ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలని.
పేర్కొన్నారు.