తెలుగులో యంగ్ హీరో నితిన్ మరియు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన “జయం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “సదా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సదా వచ్చి రావడంతోనే మంచి హిట్ అందుకోవడంతో సదా కి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ తదితర స్టార్ హీరోల సరసన నటించింది.అయితే అప్పటి వరకు వర్ష సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సదా కథల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లను ఎదుర్కొంది.
దీంతో ఈ ప్రభావం సినిమా కెరియర్ పై పడి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకో లేకపోయింది.
ఈ క్రమంలో తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమైపోయింది.కాగా అప్పట్లో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన “చంద్ర ముఖి” చిత్రంలో నటి సదా కి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట.కానీ ఆ సమయంలో నటి సదా ఇతర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో సినిమా డేట్లు కుదరలేదట.
దీంతో ఈ అమ్మడు చంద్ర ముఖి ఈ చిత్రంలో నటించే అవకాశం కొలోయింది.అయితే ఈ చంద్ర ముఖి చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయినందుకు తను చాలా బాధ పడుతున్నట్లు పలు సందర్భాలలో సదా చెప్పుకొచ్చింది.
ఒకవేళ చంద్ర ముఖి సినిమాలో సదా కనుక నటించి ఉంటే కచ్చితంగా ఈ అమ్మడి కెరియర్ ఇంకోలా ఉండేదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో నటించిన తర్వాత నటి నయనతార సినీ కెరియర్ కూడా ఒక్కసారిగా మలుపు తిరిగింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య నటి సదా తెలుగులో “శ్రీమతి 21ఎఫ్” అనే తమిళ అనువాద చిత్రం లో నటించింది.కానీ ఈ చిత్రం కనీసం విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.కాగా ప్రస్తుతం సదా తమిళంలో తెరకెక్కుతున్న “కిట్టీ పార్టీ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఏదేమైనప్పటికీ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన సదా ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.