పీసీసీ అధ్యక్షునిగా ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రేవంత్ కు అగ్ని పరీక్షలా మారే అవకాశం కనిపిస్తోంది.అయితే కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ లేకపోవడంతో హుజూరాబాద్ ఓటర్లు కాంగ్రెస్ వైపు చూస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అయితే హుజూరాబాద్ పై ఇప్పటికె ట్రబుల్ షూటర్ ఫోకస్ చేసిన పరిస్థితులలో రేవంత్ హరీష్ వ్యూహాలను తట్టుకొని నిలబడగలడా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
అయితే ఈ పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హుజూరాబాద్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తే పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పర్యటన కొనసాగిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ రెడ్డి ఇంకా హుజూరాబాద్ లో పర్యటించని పరిస్థితులలో రేవంత్ పర్యటన తరువాత రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏది ఏమైనా రేవంత్ కు అగ్ని పరీక్షలా ఉండబోతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.కాంగ్రెస్ నేతలందరు ఇక్కడ ఒక్కటై పనిచేస్తే టీఆర్ఎస్ కు చెక్ పెట్టవచ్చు అనేడు రాజకీయ విశ్లేషకుల ప్రగాఢ అభిప్రాయం.