తెలుగు సినీ నటి వనిత విజయ్ కుమార్ తాజాగా మరో లేఖతో ముందుకు వచ్చింది.ఇక అందులో తన గురించి కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకుంది.
తెలుగులో దేవి సినిమాతో పరిచయమైన వనిత విజయకుమార్ పలు భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తరచు వివాదాలకు ఇరుక్కుంటుంది.
ఇక వ్యక్తిగత విషయంలో కూడా బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంది.
గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన వనిత ఆ మధ్య మూడో పెళ్లితో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆ పెళ్లి కూడా పెటాకులు కావడంతో మరోసారి మళ్లీ ప్రేమలో పడ్డాను అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఇక తనకు ఊహించని విధంగా కామెంట్స్ ఎదురయ్యాయి.ఇక ప్రస్తుతం ఆమె సింగిల్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
ప్రస్తుతం ఆమె కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో విజయ్ టెలివిజన్ లో బిబి జోడి గల్ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి చేయగా అందులో షో నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేకపోయింది.ఈ నేపథ్యంలో తాను ఈ విషయం గురించి ఓ లేఖ ద్వారా బయట పెట్టింది.తను ఆ షోలో వేసిన కాళిక అవతారానికి మంచి ప్రశంసలు రావడంతో ధన్యవాదాలు తెలిపింది.ఇక ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు లేఖ రాసింది.తనను ఎవరైనా దూషించిన, వేధించిన సహించను అంటూ తెలిపింది.తనకు టీవీతో మంచి అనుభవం ఉండేదని అందులో పలు షోలలో కూడా పని చేస్తున్నానని తెలిపింది .
కానీ అక్కడ పనిచేసే ప్లేస్ లో తనపై వ్యతిరేకంగా ప్రవర్తించడంతో తనకు బాధ కలిగిందని.కొందరు తనతో దారుణంగా ప్రవర్తించారని తెలిపింది.మగవాళ్ళ కాకుండా ఆడవాళ్ళు కూడా తన వృత్తి పరంగా తన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోయారట.
ఇక ఆ నేపథ్యంలో తనను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని తెలిపింది.ఆ షోలో కొందరు తనను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని.
భర్త సపోర్ట్ లేకుండా ముగ్గురు పిల్లల తల్లి అయినా కూడా ఎదుగుతుంటే చాలా జెలసీ గా ఫీలవుతున్నారని తోటి మహిళలకు తోటి మహిళ సహాయం చేయాలన్న ఇంత కూడా లేదని ఇక ఆ షోకు గుడ్ బై అని తేల్చి చెప్పేసింది వనిత విజయకుమార్.