అదేంటోగానీ షర్మిలకు పార్టీ పెట్టక ముందే అనేక కష్టాలు వస్తున్నాయి.కనీసం పార్టీని స్థాపించే దాకా కూడా ఆమె వెంట ఉన్నవారు ఉండట్లేదు.
ఇప్పటికే చాలామంది కీలక నేతలు ఆమెకు దూరం అయ్యారు.ఇంకొందరు పదవులకు కూడా రాజీనామాలు చేస్తూ గుడ్ బై చెబుతున్నారు.
ఆమె వేసిన అడ్ హక్ కమిటీలకు చాలామంది రాజీనామాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.ఇప్పుడు తాజాగా ఆమెకు మరో మహిళా నేత హ్యాండ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
షర్మిల సైన్యంలో ఇందిరా శోభన్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తున్న మహిళా నేత.షర్మిల చేసే ప్రతి పనిలో ఇందిరా పాత్ర కీలకంగా ఉంటుంది.షర్మిల మొదట చేసిన జిల్లాల పర్యటనతో పాటు అడ్ హాక్ కమిటీల నియామకం వరకు అన్నింట్లోనూ ఆమె ఆలోచనలు కీలకంగా ఉన్నాయి.ఇందిరా శోభన్ మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు.
అయితే షర్మిల కోసం ఆ పార్టీ నుంచి వచ్చిన ఇందిరా శోభన్ను షర్మిలతో కాస్త పక్కన పెడుతోందని చర్చ జరుగుతోంది.
ఇక ఇదే సమయంలో టీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ నియామకం కావడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ఇప్పటికే రేవంత్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్లీ ఆహ్వానిస్తున్నారు.ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇందిరా శోభన్ ను కూడా ఆయన కలిసి చర్చించినట్టు తెలుస్తోంది.
ఇక ఇందిరా కూడా తన సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ఇక ఇందిరా శోభన్ కూడా షర్మిల సైన్యంలో ఎక్కువగా తన సామాజిక వర్గాన్ని సపోర్టు చేస్తోందని సొంత అభిమానులే డైరెక్టుగా షర్మిలకు ఫిర్యాదులు చేయడంతో ఆమె కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది.
మరి ఆమె ఎప్పుడు పార్టీని వీడుతారో కాస్త వేచిచూడాల్సిందే.