ఈ కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి.ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయిన ఘటనలు చదువుతూనే ఉన్నాము.
అందుకే రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్నో రకాల ట్రాఫిక్ రూల్స్ పెడుతున్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానాతో పాటు శిక్షలు కూడా తప్పవు అని ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు.
అయినాగాని కొంతమంది మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.ద్విచక్ర వాహనం పై కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలనీ, ఇద్దరికంటే ఎక్కువ మందిని ఎక్కించుకంటే అది చట్ట రీత్యా నేరం అని తెలిసినాగాని కొందరు మాత్రం అలానే ప్రయాణిస్తున్నారు.
అలాగే హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారని తెలిసిన ఎవరు పెట్టుకోవడం లేదు.ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎంతకాలం అని ఉరుకుంటారు చెప్పండి.
ఫైన్ల మోత మోగించేస్తారు.ఏంటి ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా.
అసలు వివరాల్లోకి వెళితే గాని మీకు మేటర్ అర్ధం కాదు.అసలు మన ట్రాఫిక్ పోలీసులు బైక్ పై ఇద్దరు కన్నా ఎక్కువ మంది ప్రయాణిస్తేనే ఊరుకోవడం లేదు.
అలాంటిది ఒకే బైక్ పై ఇద్దరు కాదు ముగ్గురు కాదు, ఏకంగా నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు.కానీ వారికి తెలియని మరొక షాకింగ్ విషయం ఏంటంటే వారితో పాటు ఒక అతిధి కూడా ఆ బైక్ లో ప్రయాణిస్తుంది అని.ఆ విషయం వారికి కొంత దూరం వెళ్ళాక గాని తెలియలేదు.ఆ అతిధిని చూసి ఆ నలుగురు యువకులకు నోట మాట రాలేదు సరికదా ఒక్కొక్కరు బైక్ దిగి పరుగో పరుగు పెట్టారు.
ఇంతకీ ఆ అతిధి ఎవరు అనుకుంటున్నారు.ఆ యువకులను భయపెట్టింది ఒక పాము.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఆ వీడియో ఒకసారి పరిశీలిస్తే ఒక బైక్ పై నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు.అయితే పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి ఓ పాము బయటకి వచ్చి యువకుల బైక్ లోకి దూరింది.దీంతో ఒక్కసారిగా బైక్ మీద ఉన్న నలుగురు ఒకేసారి భయంతో బైక్ దిగడానికి ప్రయత్నించారు.అందరు ఒకేసారి దిగేసరికి ఒకరిపై ఒకరు పడ్డారు.ఆ తరువాత పామును చూసి వెంటనే కాళ్ళకి పని పెట్టి పరుగు అందుకున్నారు.ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు.అది కాస్త నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఎవరికీ తోచిన కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులే కాదు పాము సైతం ఊరుకోదని అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.