నాచురల్ స్టార్ నాని హీరోగా వరుసగా సినిమా లు తెరకెక్కుతూనే ఉన్నాయి.గత ఏడాది వి సినిమా తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని మరో వైపు టక్ జగదీష్ సినిమా ను చేశాడు.
ఆ సినిమా షూటింగ్ ముగిసింది.విడుదలకు సిద్దం అయిన సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అవుతోంది.
షూటింగ్ పూర్తి చేశారు కనుక ఏ సమయంలో అయినా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.రికార్డ్ స్థాయి స్పీడ్ లో ఈయన తదుపరి సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం లో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ చివరి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
ట్యాక్సీవాలా సినిమా తో విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాహుల్ ఈ సినిమా తో మరింత గా స్టార్ డం దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా గా ఇది నిలుస్తుందని అంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ ను నేటి నుండి పునః ప్రారంభిస్తున్నట్లుగా నాని ప్రకటించాడు.అందుకు సంబంధించి ఫొటోను కూడా ట్వీట్ చేసి నాని సినిమా అప్ డేట్ ను ఇచ్చాడు.
అన్ని ఓకే అయితే ఈ సినిమా ను ఇదే ఏడాది లో విడుదల చేస్తారేమో చూడాలి.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశా లను కూడా రూపొందిస్తున్నారు.ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుంది.దాంతో షూటింగ్ పూర్తి అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
నాని ఈ రెండు సినిమా లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.ఇదే కాకుండా అంటే సుందరానికి అనే సినిమా ను కూడా నాని చేయబోతున్నాడు.
ఆ సినిమా మొదలు ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.