టాలీవుడ్ స్టార్ మెగా హీరో రామ్ చరణ్.ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ పెంచుకున్నాడు.
కెరీర్ మొదట్లో అంతగా గుర్తింపు తెచ్చుకోలేని రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా నిలిచాడు.తెలుగు రాష్ట్రాలలో ఈయనకున్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు.
అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు రామ్ చరణ్.
ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా.
అందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాతే ఎవరైనా.నిజానికి పవన్ తర్వాత అంతే క్రేజ్ అందుకున్న హీరో ఎవరంటే రామ్ చరణ్ అనే చెప్పవచ్చు.
ఇక ఈయన తెరముందు వరకే కాకుండా తెర వెనుక వ్యక్తిగత విషయంలో కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఎప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఎంతో ఆప్యాయంగా నడుచుకుంటాడు.
ఇక తాజాగా రామ్ చరణ్ అభిమానితో ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది.
ఇప్పటికే ఈయన కోసం ఎంతోమంది అభిమానులు ముందుకు రాగా కొన్ని రోజుల కిందట ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఇక కోవిడ్ నేపథ్యంలో ఎంతోమందికి ధైర్యం నింపాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ ను కలుసుకోవడం కోసం ఓ అభిమాని పాదయాత్ర చేసి మరి రామ్ చరణ్ ను కలిశాడు.
తన సొంత ఇంటికి ఆ అభిమానిని ఆహ్వానించాడు రామ్ చరణ్.పైగా తనను ఇంతదూరం ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు.
రోజులు బాలేవని ఎలా వచ్చావ్ అని తన మనసును చాటి చూపాడు రామ్ చరణ్.ఇక ఎంతో ప్రేమగా మాట్లాడాడు.
ప్రస్తుతం ఉన్న కోవిడ్ నేపథ్యంలో సెలబ్రెటీలు తమ ఇంట్లోకి ఎవర్ని ఆహ్వానించడం లేదన్న సంగతి తెలిసిందే.కానీ చరణ్ మాత్రం అలాంటి ఉద్దేశాలు ఏమి పెట్టుకోకుండా పైగా తన అభిమానిని కౌగిలించుకొని బాగా ఆకట్టుకున్నాడు.
ఇక ఆ అభిమానిని పక్కనే ఉన్న స్వామి నాయుడుని చూపిస్తూ ఈయనను కూడా లోపలికి రమ్మంటారా లేదా నాతో పర్సనల్ గా మాట్లాడతావా అని అడిగాడు రామ్ చరణ్.ఇక ఈ మాటకు అందరూ ఫిదా అవుతూ తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్.మా బాబు గోల్డ్ అంటూ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.