యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రామాయణం ఆధారణంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావణుడుగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు.
ఇక భారీ బడ్జెట్ తో త్రీడీ వెర్షన్ లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీగా ఆది పురుష్ నిలవనుంది.వచ్చే నెల మొదటి వారం నుంచి సుదీర్ఘ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా మీద బాలీవుడ్ లో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.టి-సిరీస్ ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఓ కీలక అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.సినిమాలో హనుమంతుడు పాత్ర కోసం ఓం రౌత్ మరాఠీ నటుడు దేవదత్తని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇతను కూడా త్వరలో జరగబోయే హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.రామాయణం కథలో హనుమాన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది.ఈ నేపధ్యంలో అలాంటి పాత్రలో నటించే అవకాశం ఆది పురుష్ లో దేవదత్త సొంతం చేసుకోవడం నిజంగా విశేషం.ఈ సినిమాలో అతను సక్సెస్ అయితే బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో పాటు సలార్ షూటింగ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.