ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ జిల్లాలో పొరపాటున రైలు ప్రమాద ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు.ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కడంతో.
ఈ సంఘటన చోటు చేసుకుంది.ఐదుగురు వేరే ట్రైన్ పొరపాటున ఏక్కగా.
వెంటనే తప్పుడు రైలు ఎక్కినట్లు తేరుకుని వేగంగా కదులుతున్న రైలు నుండి అమాంతం ఐదుగురు దిగే ప్రయత్నం చేయగా.గోరఖ్పూర్లోని దేవ్కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35) మృతి చెందటం జరిగింది.
ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వారు అజయ్ తన అంకుల్ జగ్మోహన్, సోదరుడు విజయ్, తన స్నేహితులు సందీప్, సంజయ్.వీళ్లందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లడానికి ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ రైల్వే స్టేషన్ కి చేరుకుని.
ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న ట్రైన్ అనుకొని ఢిల్లీ వైపు వెళ్లే ట్రైన్ ఎక్కడం జరిగింది.ఈ ప్రయత్నం లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.