ఈ ఏడాది బిగ్గెస్ట్ చిత్రం ఏది అంటే ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో ఉప్పెన నిలుస్తుంది.కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో కూడా టాప్ చిత్రాల జాబితాలో ఈ సినిమా ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.
అలాంటి ఉప్పెన విడుదల అయ్యి నెలలు గడుస్తు ఉన్నా కూడా కుమ్మేస్తూనే ఉంది.అప్పుడు థియేటర్లలో ఆ తర్వాత ఓటీటీ లో ఇప్పుడు బుల్లి తెరపై.
ఉప్పెన సినిమా ను ఇప్పటికే టెలికాస్ట్ చేసిన సమయంలో ఏకంగా 18 రేటింగ్ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.కొత్త హీరో మూవీకి ఆ రేంజ్ లో టీఆర్పీ రావడం మామూలు విషయం కాదు.
మళ్లీ తక్కువ గ్యాప్ లోనే ఉప్పెన సినిమా ను టెలికాస్ట్ చేశారు.ఈ సమయంలో కూడా ఉప్పెన సినిమా ఏకంగా 12 రేటింగ్ ను దక్కించుకుంది.
ఉప్పెన సినిమా కు ఉన్న క్రేజ్ ఏంటీ అనేది మరో సారి నిరూపితం అయ్యింది.
ఉప్పెన సినిమా తో మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
సుకుమార్ ఈ సినిమా ను సమర్పించాడు.వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా మొదటి పాట విడుదలైనప్పటి నుండి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో కరోనాను లెక్క పెట్టకుండా ప్రేక్షకులు వంద కోట్ల వసూళ్లను కురిపించారు.
ఇప్పుడు టీవీ లో కూడా విపరీతంగా చూస్తే రికార్డు రేటింగ్ ను ఇస్తున్నారు.మొత్తానికి ఉప్పెన ఈ ఏడాదిలో ది బెస్ట్ మూవీ గా నిలిచింది… ఈ రేంటింగ్ తో తన స్థానంను మరింతగా పదిలం చేసుకుంటుంది.