ఎప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తూ చివరికి జైలుకు వెళ్లివచ్చిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఇక రఘురామ ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేసినట్లుగా గతంలో ఎన్నో పొలిటికల్ దుమారం రేపే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్న రెబెల్ ఎంపీ, ఏపీ ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు రద్దుచేసిన అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం మంచిదైందని, ఈ వ్యవహారం లో సకాలంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంటూ, ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు.
ఇదిలా ఉండగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పరీక్షల రద్దు నిర్ణయం పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.