ఏపీ సీఎం జగన్ కు ఊరటకలిగించే వార్త ఏంటంటే ఇన్నాళ్లుగా ఆయనపై ఉన్న కేసుల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి.అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పై నమోదైన కేసుల ఎత్తివేత అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక విషయాలను ప్రస్తావించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని, అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా జగన్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఇకపోతే చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం బయటపడ్డాక ఇష్టం వచ్చిన రీతిలో జగన్ పై కేసుల నమోదు చేసారని, ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటూ దుయ్యబట్టారు.
కాగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై ఉన్న కేసులను ఎత్తివేయగా లేనిది సీఎం జగన్ పై ఉన్న కేసులు ఎత్తివేస్తే విడ్డూరం ఏంటని ప్రశ్నించారు.