అధికార పార్టీ వైసిపి కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి మరి దాడులకు పాల్పడుతోందని టిడిపి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ఇటీవల ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన క్రమంలో .
జిల్లాలో కార్యకర్తలపై దాడులకు పాల్పడిన ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు.పార్టీ కోసం పని చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. జర్మనీ దేశంలో అప్పటి పాలకుల నాజీలు వ్యవహరించిన దానికంటే జగన్ ప్రభుత్వంలో అరాచకాలు దారుణం అయ్యాయి అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా టైం ఎప్పుడు ఒకేలా ఉండదు అని .తెలుగుదేశం పార్టీకి కూడా టైం వస్తుందని ఈ విషయం జగన్ అనుచరులు గుర్తుంచుకోవాలి అంటూ అచ్చెన్నాయుడు సీరియస్ కామెంట్లు చేశారు.అదే రీతిలో పోలీసు వ్యవస్థపై డీజీపీపై కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.