ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్య నియంత్రణ విషయం లో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.మద్యం బాటిల్స్ పై రేట్లు పెంచడం మాత్రమే కాక మద్యం దుకాణాలు తక్కువ టైం మాత్రమే తెరిచి ఉండడంతో మందుబాబులు అనేక అవస్థలు పడ్డారు.
అంత మాత్రమే కాక ఎప్పటికప్పుడు మారిపోయే కొత్త కొత్త బ్రాండ్ బాటిల్స్ రావటంతో ఏపీ మందుబాబులు అనేక అవస్థలు పడ్డారు.
ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 33 బార్లలో కొత్తగా విదేశీ మద్యం ప్రవేశపెట్టడం ఉత్తర్వులు జారీ చేస్తూ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.దీంతో ఇప్పటివరకు లోకల్ బ్రాండ్ విషయం లో బోర్ కొట్టిన మందుబాబులకు విదేశీ మద్యం అందుబాటులోకి వచ్చే రీతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఏపీ మందుబాబులకు కచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
రాష్ట్రంలో పర్యాటక శాఖ ప్రోత్సహించే విధానంలో విదేశీ దేశీయ పర్యటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.