టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.అయితే ఇంతకు ముందు వరకు మా ఎన్నికలు ఇంత రసవత్తరంగా ఉండేవి కాదు.
ఇంతకు ముందు ప్రెసిండేట్ పదవి కోసం ఏకగ్రీవముగా ఎన్నుకునే వారు.కానీ గత ఎన్నికల నుండి పోటీ మొదలయ్యింది.
గత ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రశాంతంగా జరిగే ఎన్నికలు కాస్తా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోస్తూ ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఈ ఎన్నికలను రసవత్తరంగా మార్చారు.
రెండు సంవత్సరాల కొకసారి జరిగే మా ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి.అయితే ఈసారి మరింత హీట్ పెంచుతున్నాయి.ఎందుకంటే ఈసారి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురైదుగురు పోటీ పడబోతున్నారు.
ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఈసారి పోటీ వీరిద్దరి మధ్య ఉంటుందని అనుకుంటే ఎవ్వరు ఊహించని విధంగా ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తూ పోటీలో హీట్ పెంచుతూ పోతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తో పాటు అదే పోస్ట్ కోసం జీవిత రాజశేఖర్, నటి హేమ కూడా బరిలోకి దూకడంతో పోటా పోటీగా ఈసారి ఎలక్షన్స్ జరగనున్నాయి.
అయితే ఇక్కడితో ఆగకుండా మరొకరు కూడా మా ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అది ఎవరో కాదు సీనియర్ నటుడు సాయి కుమార్ అని తెలుస్తుంది.ఇప్పటికే నలుగురు పోటీ చేస్తున్నారు.ఇప్పుడు సాయి కుమార్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఎన్నికలు మరింత హీట్ పెంచాయి.
అయితే ఇంత మందిలో ఇప్పుడు ఎవరి గెలుస్తారో అని టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలు కూడా ఎదురు చూస్తున్నాయి.ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలు కాస్తా నువ్వా నేనా అనే స్థాయికి రావడంతో ఈసారి ఎన్నికలు మంచి ఇంట్రెస్టింగ్ గా మారాయి.
చూడాలి మరి చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో.