తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, తదితర స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ బొద్దుగుమ్మ “ఖుష్బూ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి ఖుష్బూ తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో కూడా తనకంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకుంది.
అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా నటించి బాగానే అలరించింది.ఈ క్రమంలో నటి ఖుష్బూ ప్రతిభ కి పలు ఫిలిం ఫేర్ మరియు జాతీయ అవార్డులు కూడా వరించాయి.
నటి కుష్బూ ఎంత అందంగా ఉంటుందో అంతే కఠినంగా కూడా ఉంటుంది.అలాగే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ముక్కు సూటిగా సుత్తిలేకుండా విషయాన్ని తేల్చి చెప్పడం కుష్బూ ప్రత్యేకత.
అలాగే ఎవరైనా నటీనటులు కష్టం వచ్చిందని తన ఇంటి తలుపు తడితే సహాయం చేయడంలో ముందు ఉంటుంది.అయితే గతంలో నటిఖుష్బూ తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో ఖుష్బూ ను కమిట్మెంట్ అడగడంతో ఒక్కసారిగా ఫైర్ అయ్యింది.
అంతేకాకుండా ఆ హీరో కూతురుని తన తమ్ముడి గదిలోకి పంపిస్తే తాను ఆ హీరోకి కమిట్మెంట్ ఇస్తానంటూ చెంప చెళ్లుమనిపించే మాటలతో సమాధానమిచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆ ప్రముఖ హీరో కి నటి కుష్బూ కి మధ్య మాటలు లేనట్లు సమాచారం.
దీంతో కొందరు నెటిజన్లు ఖుష్బూ ని లైంగికంగా వేధించిన ఆ సీనియర్ హీరో ఎవరా…? అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి ఖుష్బూ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.కాగా ఈ మధ్య ఖుష్బూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చింది.కాగా ఇటీవల తమిళనాడులో జరిగిన లోక్ సభ ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేసింది.
కానీ అనుకోకుండా ఓటమిపాలైంది.దీంతో మళ్లీ తన సినీ కెరీర్ పై దృష్టి సారించినట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం ఖుష్బూ తమిళంలో రజనీ కాంత్, నయనతార, మీనా, తదితరులు నటిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.