తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెంటిల్మెన్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా హీరోయిన్ గా పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ “నివేథ థామస్” గురించి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నివేథ థామస్ ఇటీవలే తెలుగులో పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి బాగానే ఆకట్టుకుంది.
దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే తలుపు తడుతున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపి వేయడంతో నివేథ థామస్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఇందులో భాగంగా తాజాగా నివేథ థామస్ తాను కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఇలా చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులతోపాటు ఇతరులను కూడా సురక్షితంగా ఉంచవచ్చని సూచించింది.అలాగే ఇటీవల “ఫాదర్స్ డే” సందర్భంగా చిన్నప్పుడు తన తండ్రి తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ “పితృ దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నివేథ థామస్ తెలుగులో “మిడ్ నైట్ రన్నర్స్” చిత్ర రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపి వేయడంతో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కొంతకాలంపాటు తాత్కాలికంగావాయిదా వేసినట్లు సమాచారం.