ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
పరిస్థితులు చక్కబడడంతో మళ్ళీ రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
సారధి స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేసాడు రాజమౌళి.
షూటింగ్ మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ సెట్ లో మొదటి రోజే రామ్ చరణ్ అడుగు పెట్టాడు.అయితే ఈ రోజు తారక్ కూడా సెట్ లో అడుగు పెట్టాడని తెలుస్తుంది.తారక్ షూటింగ్ లో జాయిన్ అయినా ఫోటో ఒకటి బయటకు వచ్చింది.ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ చివరి షెడ్యూల్ లో రామ్ చరణ్, తారక్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించ బోతున్నాడు రాజమౌళి.
అంతేకాదు 6 నిముషాల పాటు సాగే సుదీర్ఘ పాటను కూడా షూట్ చేయబోతున్నాడు.
ఇది పూర్తి అయినా తర్వాత రామోజీ ఫిలిం సిటీలో చరణ్ ఆలియా భట్ పై ఒక రొమాంటిక్ పాటను షూట్ చేస్తారట.ఈ పాట షూట్ కోసం ఆలియా జులై మొదటి వారంలో చిత్ర యూనిట్ తో జాయిన్ కాబోతుందట.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.మొత్తానికి కరోనా నుండి బయట పడి షూటింగ్ స్టార్ట్ చేసారు రాజమౌళి.