పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు.ఈ సినిమా తర్వాత చక చకా సినిమాలు ఒప్పుకుంటూ ఒప్పుకున్నా సినిమాలను అంతే ఫాస్టుగా పూర్తి చేయడానికి పవన్ సిద్ధం అయ్యాడు.
తన కెరీర్ లో ఎప్పుడు లేనంతగా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ బిజీగా ఉంటున్నాడు పవన్.
ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతుండడంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.అయితే పవన్ ఈ సినిమా తో పాటు అయ్యప్పనుమ్ కోషియం అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు.ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది.యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.
అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ రూమర్ నిజమే అని వినాయక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.అంతేకాదు తన పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చాడు వినాయక్.ఈ సినిమాలో వినాయక్ చిన్న రోల్ లో కనిపిస్తున్నాడని అది కూడా డైరెక్టర్ గానే కనిపిస్తానని ఆయన తెలిపారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.