ఈనెల 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరగబోయే ఈ మీటింగ్ లో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా సృష్టించిన విలయతాండవం కారణంగా కర్ఫ్యూ సడలింపు.ఇంకా కరోనా చికిత్స విషయంలో అదేవిధంగా కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం లాక్ డౌన్ అమలవుతున్న తీరు.ఇంకా పలు విషయాలు అదేరీతిలో మరో కీలక బిల్లులు వంటి వాటిపై జగన్ రాష్ట్ర మంత్రులతో చర్చించనున్నారట.
చాలావరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చే అవకాశం ఈ సమావేశంలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం.ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో దీన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి
.