ఈనెల 30వ తారీఖున ఏపీ మంత్రివర్గ సమావేశం..!!

ఈనెల 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరగబోయే ఈ మీటింగ్ లో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 Ap Cabinet Meeting On 30th Of This Month Jagan, Ap Cabinet, 30 Th ,  Aboutcarfue-TeluguStop.com

ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా సృష్టించిన విలయతాండవం కారణంగా కర్ఫ్యూ సడలింపు.ఇంకా కరోనా చికిత్స విషయంలో అదేవిధంగా కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం.

అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం లాక్ డౌన్ అమలవుతున్న తీరు.ఇంకా పలు విషయాలు అదేరీతిలో మరో కీలక బిల్లులు వంటి వాటిపై జగన్ రాష్ట్ర మంత్రులతో చర్చించనున్నారట.

చాలావరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చే అవకాశం ఈ సమావేశంలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం.ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో దీన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube