మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం కూలిపోవడం గ్యారెంటీ అని .
అన్నారు.ఇటువంటి దారుణమైన ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదు.
ప్రతిపక్షంగా మేము పోరాడుతాం అంటూ విలేకరులతో మాటామంతి సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కామెంట్లు చేయడం జరిగింది.మహావికాశ్ అఘాడీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఫెయిల్ అయిందని ఈ నేపథ్యంలో కరోనా పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది అంటూ మండిపడ్డారు.
ఇటీవల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని మహావికాశ్ అఘాడీ ప్రభుత్వం డిసైడ్ అవటంతో.బీఏసీ సమావేశం నుంచి బిజెపి తప్పుకోవటం జరిగింది.
తర్వాత మీడియాతో దేవేంద్ర ఫడ్నవీస్.వర్షాకాల సమావేశాలు రెండు రోజులు నిర్వహించటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదని తెలిపారు.
రాష్ట్రంలో రైతులు ప్రజలు విద్యార్థులు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, అలాంటప్పుడు రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజాసమస్యలు పై చర్చ ఎలా జరుగుతుంది అందువల్లే బిఎసి సమావేశం నుంచి తప్పుకున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గెలవడం గ్యారెంటీ అని జోస్యం చెప్పారు.