శేఖర్ కమ్ములకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.తన సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చుని చూడగలిగేలా ఉంటాయి.
ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా సినిమాలతో కొత్త ప్రేమ కథలను ప్రేక్షకులకు పరిచయం చేసు కమ్ముల.ఈయనకు ప్రేమ కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉంది.
మనసుకు హత్తుకునేలా తీయగలిగే సత్తా ఉంది.
ఈయన తన సినిమాల్లో హీరోలకు మాత్రమే కాదు హీరోయిన్స్ కు కూడా మంచి మంచి పాత్రలను నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కల్పిస్తాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ‘ అనే ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.
ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాను ఏప్రిల్ 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేయగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్న సమయంలో మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు 120 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారని టాక్.శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలు చేయలేదు.అయితే ఇప్పుడు ధనుష్ తో హెవీ బడ్జెట్ తీయబోతున్నాడు.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.
కాబట్టి నిర్మాణ విలువలు ఆ రేంజ్ లో ఉండబోతున్నాయని అంతేకాదు నటీ నటులకు అయ్యే ఖర్చు కూడా బడ్జెట్ పెరగడానికి ఒక కారణం అయ్యుండవచ్చని తెలుస్తుంది.మొత్తానికి శేఖర్ మొదటిసారి బిగ్ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను తీస్తున్నాడు.చూడాలి మరి ఇది ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.