ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయములో నమోదైన 11 కేసులు నిబంధనలకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చాక కొట్టి వేయించుకున్నటు ఆరోపణలు వచ్చాయి.దీంతో తాజాగా ఈ కేసులకు సంబంధించి సుమోటోగా న్యాయస్థానం విచారణ చేయడానికి సిద్ధమైంది.
కేసుల విషయంలో పోలీస్ వ్యవస్థ అదేరీతిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు మరికొంత మంది న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా.వ్యవహరించినట్లు కేసులను ఉపసంహరించుకున్నట్లు.
హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.
ఇటీవల ఈ కేసులకు సంబంధించి వివరాలు న్యాయస్థానం దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం .మొత్తం పరిశీలించి వీటిపై విచారణ చేయడానికి రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించడం జరిగింది.దీంతో నేడు ఈ కేసుల విషయానికి సంబంధించి విచారణ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు.ఈ కేసులో దాదాపు ఐదు కేసులు అనంతపురం జిల్లాలో నమోదు కాగా ఆరు కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.