కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా ఉందన్న విషయం మనకు తెలిసిందే.అయితే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలతో ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎన్నికకు ఎదుర్కోబోతుంది.
ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలలో పోటీ చేసినా ఏ ఒక్క చోట కూడా గెలుపు అనేది వరించలేదు.అయితే ఇప్పటివరకు పీసీసీ చీఫ్ ను ఇంకా ఖరారు చేయకపోవడం ఒక కారణం కాగా కార్యకర్తలకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతూ వస్తున్నారు.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హుజూరాబాద్ లో సత్తా చాటి తిరిగి కాంగ్రెస్ ను బలపరచుదామనే ఆలోచనలో వ్యూహాలు పటిష్టం చేస్తున్నట్లు తెలిసిన పరిస్థితి ఉంది.అక్కడ నిజానికి టీఆర్ఎస్ తరువాత స్థానంలో ఉన్నది కాంగ్రెస్ మాత్రమే.
ఇప్పుడు ఈటెల బీజేపీలో చేరడంతో ప్రజల ఓట్లు చీలితే కాంగ్రెస్ కు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తేనే కాంగ్రెస్ కు విజయం ఖాయమయ్యేలా కనిపిస్తోంది.
లేకపోతే ఏటుకు ఎదురీదడమే తప్ప ప్రయోజనం లేదు.
ఏది ఏమైనా కాంగ్రెస్ తన సత్తా నిరూపించుకోవడానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు.మరి హుజూరాబాద్ లో ఏమి జరుగుంద నేది చూడాల్సి ఉంది.