ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం తాడేపల్లి కి దగ్గరలో అమ్మాయి పై అత్యాచారం ఘటన పై.ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.
స్వయంగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరలో ఉన్న ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఉండే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ .ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.కాగా తాజాగా ఈ ప్రకాశం బ్యారేజి ఘటన పై సీఎం జగన్ స్పందించారు.నిజంగా ఇటువంటి దారుణమైన ఘటన జరగడం తన మనసును ఎంతగానో కలిచివేసింది అని పేర్కొన్నారు.
ఇటీవల వైయస్సార్ చేయూత రెండోసారి లబ్ధిదారులకు విడుదల చేసే టైమ్లో ఈ కామెంట్లు చేయడం జరిగింది.తాజా ఘటన పై స్పందిస్తూ.
దేశంలో అర్ధరాత్రి ఆడవాళ్లు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిన అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.
రాష్ట్రంలో పటిష్టంగా భద్రత మహిళలకి అందిస్తామని, అభయం దిశ యప్ లపై.మరింత అవగాహన ఉండేలా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ .చేసేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.