సాధారణంగా జంతువులు ఏ క్షణంలో ఏం చేస్తాయో తెలీదు.జంతువులలో కొన్ని హాని చేస్తే ఇంకొన్ని మేలు చేస్తాయి.
కొన్ని పెంపుడు జంతువులు మనుషులు చేసే పనులు చేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాయి.అందుకే సర్కస్ లల్లో ఎక్కువగా జంతువులని ఉపయోగిస్తుంటారు.
జంతువులు చేసే కోన్ని పనులు విచిత్రంగా ఉంటాయి.ఇంకొన్ని వింతగా ఉంటాయి.
అలా సర్కస్ లల్లో జంతువులతో వివిధ రకాల ఫీట్లు, ఫన్నీ గేమ్సు ఆడిస్తుంటారు.ఆ మధ్య ఎప్పుడో రష్యాలో కూడా ఓ సింహంతో సర్కస్ చేయించారు.
ఆ సమయంలో ట్రైనర్ పై ఆ సింహం దాడి చేసింది.అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.
ఇప్పుడు తాజాగా చైనాలో కూడా ఇలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.చైనాలోని ఓ సర్కస్ వేదికపై నాటకం జరుగుతోంది.
ఆ సమయంలోనే తోడేళ్ళు అటాక్ చేశాయి.నాటకం వేస్తున్న నటులను గాయాలపాలు చేశాయి.
ముందుగానే శిక్షణ ఇచ్చారు.అయినా కూడా ఆ జంతువులు వింతగా ప్రవర్తించాయి.ఆ జంతువుల ప్రవర్తనతో సర్కస్ కు వచ్చిన వారు భయాందోళన చెందారు.కథను రక్తికట్టించడానికి తోడేళ్ళను నిర్వాహకులు వేదికపైకి వదిలారు.
దీంతో అవి నాటకం ఆడేవారిపై డాడి చేసి బెంబేలెత్తించాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నాటకం జరిగే స్టేజ్ పైన నటులు కూడా షాక్ తిన్నారు.వారికి చేతికందిన కర్రలతో తోడేళ్లను కొట్టారు.
ఆ సమయంలోనే ఆ తోడేళ్లు ప్రేక్షకుల ముందుకు పరుగులు తీశాయి.కొందరికి కొరికేశాయి.
దాంతో ఆడియన్సు భయాందోళన చెందారు.అరుపులతో కేకలు వేసుకుంటూ ఆ ప్రాంతంలో రక్షించమని వేడుకున్నారు.
ఈ సంఘటన వాయువ్య చైనా జియాన్ ప్రదేశంలో ఈ షాకింగ్ జరిగింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.నెటిజన్లు సర్కస్ నిర్వహించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా పెంపుడు లేదా ఎదైన జీవి మన దగ్గర ఉంది అంటే ఎంతో కొంత జాగ్రత్తగా ఉండడం మేలు.
లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.