నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు చేస్తారా అనే అంశంపై ప్రస్తుతం టాలీవుడ్లో చర్చ సాగుతోంది.
ఇప్పటికే గోపీచంద్ లాస్ట్ మూవీ క్రాక్ హీరోయిన్ శృతి హాసన్ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని గోపీచంద్ భావించాడు.కానీ ప్రస్తుతం ఆమె సలార్ చిత్రంలో నటిస్తుండటంతో, బాలయ్య సరసన హీరోయిన్గా చేసేందుకు పెద్దగా ఆసక్తిగా లేదని తెలుస్తోంది.
దీంతో బాలయ్య కోసం మరో బ్యూటీని తీసుకునేందుకు గోపీచంద్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలో అందాల భామ మెహ్రీన్ పీర్జాదాను బాలయ్య చిత్రంలో హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేస్తున్నారట చిత్ర యూనిట్.
అటు టాలీవుడ్లో ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న మెహ్రీన్, తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
ఇక బాలయ్య లాంటి స్టార్ హీరో చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో మెహ్రీన్ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే ఈ సినిమాలో నటిస్తే, మెహ్రీన్కు మరిన్ని అవకాశాలు వచ్చి పడతాయని ఆమె అభిమానులు అంటున్నారు.
మరి బాలయ్య చిత్రంలో మెహ్రీన్ నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.