అక్కినేని నాగేశ్వరరావు తన సినీ కెరీర్ లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించారనే సంగతి తెలిసిందే.నాటక రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏఎన్నార్ ధర్మపత్ని సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ధర్మపత్ని సినిమాలో బాలనటుడిగా నటించిన ఏఎన్నార్ సీతారామజననం సినిమాతో హీరోగా మారడంతో పాటు తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
250కు పైగా సినిమాలలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నాగేశ్వరరావు నటించడం గమనార్హం.అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలలో ముగ్గురు మరాఠీలు సినిమా ఒకటి కాగా నాగేశ్వరరావుకు జోడీగా ఈ సినిమాలో కమలాదేవి నటించారు.ఈ సినిమా కోసం ఏఎన్నార్, కమలాదేవి సొంతంగా ఒక డ్యూయెట్ తో పాటు ప్రార్థనా గీతాన్ని పాడారు.
సాంగ్ రికార్డింగ్ సమయంలో ఏఎన్నార్, కమలాదేవిలకు ఎవరూ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు.
తమనకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏఎన్నార్ కు చాలా కోపం వచ్చింది.
టిఫిన్ గురించి అడగాలని అనుకున్నా అడగటానికి ఏఎన్నార్ కు ఆత్మాభిమానం అడ్డొచ్చింది.ఆ తరువాత ఏఎన్నార్ కోపంతో స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు.ఏఎన్నార్ మద్రాస్ లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.ఏఎన్నార్ తన దగ్గర ఉన్న ర్యాలీ సైకిల్ ను తీసుకుని తనకు, కమలాదేవికి స్పెషల్ కేకులను తెచ్చారు.
ఏఎన్నార్ బయటకు వెళ్లి ఆ విధంగా స్పెషల్ కేకులు తెచ్చుకోవడంతో యూనిట్ సభ్యులు షాకయ్యారని సమాచారం.ప్రొడక్షన్ వాళ్లు ఏఎన్నార్ ను చూసి ఈ కుర్రాడికి పౌరుషం ఎక్కువేనని అనుకున్నారని తెలుస్తోంది.ఏఎన్నార్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా నటించారు.సినిమాలతో పాటు ఏఎన్నార్ సీరియల్స్ లో కూడా నటించారు.ఒకే ఒక్కడు, మట్టి మనుషులు సీరియల్స్ ద్వారా ఏఎన్నార్ మంచి పేరు తెచ్చుకున్నారు.