టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియ భట్ తో పాటు హాలీవుడ్ తారాగణం కూడా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్ మార్చిలో ఆగిపోయింది.
అయితే మరల తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ తొలగించి షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో మరల టాలీవుడ్ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వస్తున్నాయి.ఈ నేపధ్యంలో తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కూడా జక్కన్న స్టార్ట్ చేశాడు.
ఇక తాజా షెడ్యూల్ రామ్ చరణ్ తో రాజమౌళి స్టార్ట్ చేశాడు.
సారథి స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ ప్రారంభించారు.
అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కి సంబందించిన కీలక సన్నివేశాలు షూటింగ్ మొదటి రోజు జరిగింది.ఇక రామ్ చరణ్ కి సంబందించిన ఎపిసోడ్స్ కొన్ని రోజులు సారథిలో పూర్తి చేసిన తర్వాత మరల ఎన్టీఆర్ కి సంబందించిన ఎపిసోడ్స్ కోసం రాజమౌళి షెడ్యూల్ ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక గ్యాప్ లేకుండా సుదీర్ఘ షెడ్యూల్ తో ఈ సారి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని జక్కన్న ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.తరువాత సాంగ్స్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రామ్ చరణ్ శంకర్ సినిమా కోసం జాయిన్ అవుతారని తెలుస్తుంది.అవకాశాన్ని బట్టి ఆగష్టులో శంకర్ తన మూవీ స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.