కమలం కేసీఆర్ అహంకారాన్ని అణిచి వేస్తుంది.. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు.. !!

ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారో అప్పటి నుండి గులాభి పార్టీ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయట.సామాన్యంగా కారు పార్టీలో ఎవరైన నేత అలిగి పక్క పార్టీ వైపు చూస్తే టీఆర్ఎస్ పెద్దల్లో ఎవరో ఒకరు రంగంలోకి దిగి వారి అలకకు కారణాలు తెలుసుకుని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు.

 Telangana Bjp Incharge Tarun Chugh Comments On Trs Telangana, Bjp Incharge, Taru-TeluguStop.com

వారు కోరుకున్న వరాలు కూడా ఇస్తామని హమీలు కూడా గుప్పిస్తారట.కానీ ఈటల విషయంలో అలా జరగలేదు.

నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినట్లుగా ఈటల అభిమానులు వాపోతున్నారట.

ఇకపోతే హూజురాబాద్ నియోజక వర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో అవినీతి పరులు ఓడిపోతారని, ముఖ్యంగా కేసీఆర్ అహంకారాన్ని హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కమలం అణిచి వేస్తుందని వ్యాఖ్యానించారు.

అదీగాక తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం చేసి, రైతులను, యువకులను మోసం చేస్తున్న కారు పార్టీని గ్యారేజీలోకి పంపించడం ఖాయం అంటూ పేర్కొన్నారట.మరి చూడాలి రానున్న రోజుల్లో జరిగే రాజకీయ మార్పు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube