నిన్న సిద్దిపేట జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే.కాగా ఈ ఫోగ్రాం కు మంత్రి హరీష్ రావు కూడా హజరు అయ్యారు.
ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి హరీష్ రావు తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి కూడా తెలిసిందే.
కాగా ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ఈ ఘటన తాలూకు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారట.ఇక ఈ విషయం పై స్పందించిన హరీశ్ రావు.తమ బాగోగుల గురించి విచారించిన గవర్నర్ మేడమ్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారట.ఎంతైన రాజకీయ నేతలు ఒకరికొకరు పరమార్శించుకోక పోతే బాగుండదు కదా.వీరు వీరు ఒకటి.కానీ తెలంగాణలోని ప్రజలు ఇంతటి గడ్దుపరిస్దితులు ఎదుర్కొంటున్న ప్రశ్నించే గొంతులే వినబడటం లేదని సామాన్యులు ఆవేదన చెందుతున్నారట.